30, నవంబర్ 2012, శుక్రవారం

ఉపనిషత్తులలో - యింత గొప్ప సామాజిక న్యాయం మనం తీసుకు రాగలమా? - అన్నం న నింద్యాత్ - అతిథి దేవో భవ - ఆకలి లేని రాజ్యం -


ఉపనిషత్తులలోని సామాజిక న్యాయం 



ఉపనిషత్తులు మన వేదవాంగ్మయం లోని అంతర్గత భాగాలు.అవి ఎప్పుడు రాయ బడ్డాయో ఎవరికీ తెలీదు. పది వేల సంవత్సరాలూ వుండొచ్చు. పది లక్షల సంవత్సరాలూ వుండొచ్చు. అవి ఎప్పటివో?

కృష్ణుడు పుట్టడానికి ముందటివి. రాముడు పుట్టడానికి ముందటివి. అంతకు ముందు ఎవరెవరు వున్నారో ఎలా వున్నారో - ఉపనిషత్తుల నుండి కొద్దిగా మనకు తెలుస్తుంది.  

ఉపనిషత్తుల పని - అప్పటి చరిత్ర , అప్పటి సమాజం గురించి చెప్పడం కానే కాదు.

 మనం చూస్తున్నది నిజమా, దీనిని మించిన నిజం మరేదైనా వుందా - అన్న దానిపై విస్త్మృతమైన  పరిశోధన  చేశారు అప్పటి ఋషులు. అప్పట్లో - వారు ఋషులు మాత్రం కాదు;మహా దూర దృష్టి  గల, సత్య వాక్పరిపాలకులైన వైజ్ఞానిక పరిశోధకులు  కూడా .

ఏది సత్యం, ఏది సత్యం - అని సత్య సాధనకై, సత్య శోధనకై , సత్య సాక్షాత్కారానికై తమ జీవితాలను,  ధారపోసిన మహానుభావులు.  

వారు చెప్పిన ఉపనిషత్తులు  మనం చదవక పోతే - మన జీవితాన్నే మనం వ్యర్థం చేసినట్టు - అన్న  విషయం - 60 ఏళ్ళ వయసు తర్వాతనే  నాకు తెలిసి వచ్చింది. రిటైర్ అయిన తర్వాత - స్వామి పరమార్థానంద గారి క్లాసులకు వెళ్లాను. మరెంతో మంది ప్రవచనాలు వింటూ వచ్చాను.

అవి మొదట పెద్దగా రుచించలేదనే మాట వాస్తవం. కానీ వాట్లో వున్న గొప్ప గొప్ప వాస్తవాలు  అర్థమయ్యే కొద్దీ - నా  మెదడు -లోని అవాస్తవికత  మెల్ల మెల్ల గా దూరం అవుతూ వుంది.

వారి  ఆలోచనా పటుత్వం -    ఎన్ని వేల, లక్షల సంవత్సరాల నాటిదైనా - యిప్పటి కంటే  చాలా గొప్పది అనడంలో - నాకు మాత్రం సందేహం లేదు.

వాటిలో న్యాయం వుంది. ధర్మం వుంది. మనం ఈ నాడు మాట్లాడే సామాజిక న్యాయమూ వుంది. అవే, మరో లక్ష సంవత్సరాలైనా, మన పరిస్థితులు ఎలా మారినా - ఎప్పుడూ నిలకడగా నిలువ గలిగేవి.

యిప్పుడు మనం మాట్లాడే న్యాయాలు - చాలా, చాలా పేలవమైనవి;    కొన్ని - సంవత్సరాల్లోనే  ఈ నాటి న్యాయాలు - రేపటి అన్యాయాలుగా మారేవి. నిజానికి న్యాయానికై  మనం చేసుకున్న ఎన్నో చట్టాలు, ఇప్పటికే - అన్యాయాలకు  నిలయమై పోయాయి. చాలా చట్టాలలో - న్యాయం జరగడం లేదనేది వాస్తవమైన విషయం. 

అంతే కాదు. ఏ వొ క్కరికీ - నిజమైన సంతోషాన్ని, న్యాయాన్ని  చేకూర్చ లేనివి - మనం ఈ రోజు పెట్టుకుంటున్న ఈ నాటి న్యాయాలు, చట్టాలు .

వీటితో పోల్చి చూస్తే - ఉపనిషత్తుల నాటి న్యాయాలు - ఎంతో బాగున్నాయి.

అందుకు కొన్ని ఉదాహరణాలు మాత్రమే -యిక ముందు, కొన్ని వ్యాసాల్లో,  మీ ముందు వుంచుతున్నాను.

ఇవేవీ చట్టాలు కాదు. యివి,సరాసరి మనుషులైన మనం పాటించ వలసిన కనీస నియమాలు.

కొన్ని నియమాలు , మనిషి, మహా మనీషిగా మారాలంటే పనికొచ్చేవి. మరి కొన్ని మనమే దేవుడు గా మారాలంటే - పనికొచ్చేవి. 

యిప్పుడు మొదట తైత్తిరీయ ఉపనిషత్తు లోని కొన్ని సూత్రాలు నియమాలు, సందేహాలకు సమాధానాలు - యివి మీ ముందుంచుతున్నాను. 

1. అన్నం న నింద్యాత్  . తద్ వ్రతం. (తై .ఉ. 3.7). 


    మనం ఆహారాన్ని ఎప్పుడూ నిందించరాదు  - అనేది వొక వ్రతం. అన్నాన్ని నిందించని వాడే - బ్రహ్మజ్ఞానానికి    అర్హుడు. అటువంటి వాడికే - పుష్కలంగా - అన్నం కూడా యివ్వ బడుతుంది. అన్నాన్ని నిందించే వాడికి - సరైన ఆహారమూ దొరకదు. అది పుష్కలంగానూ యివ్వ బడదు యిచ్చినా, అతడు, ఆ ఆహారాన్ని తినలేని పరిస్థితుల్లో వుంటాడు - యిలా ఎన్నో చోట్ల ఉపనిషత్తులలో చెప్పబడింది.  యిక్కడ - అన్నము, లేదా ఆహారము అంటే - మనం అనుభవించే అన్నిటినీ - అని కలిపి చెప్పుకోవచ్చు.

నిందించడమంటే - తిట్టడం మాత్రమే  కాదు. తట్ట లోనో, ఆకులోనో వేసుకున్న ఆహారాన్ని, ఎవరిపైననో కోపం తో  విసిరి వేయడం, చేసిన వారినో, వండిన వారినో తిట్టడం కూడా యిందులోకే వస్తుంది. - మనలో కొంత మంది ఇలాంటివి ఎన్నో చేస్తాము. యిది బాగు లేదు, అది బాగు లేదు - అనడం కూడా పనికి రాదు. యివన్నీ చేయ రాదు. దీని తరువాత మరి కొన్ని వస్తాయి. అవీ చదవండి.

2.అన్నం పరిచక్షీత.   తద్ వ్రతం. (తై .ఉ. 3.8). 


అన్నాన్ని నిరసన  భావంతో ఎప్పుడూ, నిరాకరింప కూడదు. యిది కూడా వొక వ్రతం. వ్రతం అంటే ఏమిటి?  నమ్మకంతో, భక్తితో పాటించ వలసిన నియమం. అన్నం పట్ల పూర్తి సద్భావం వుండాలి  వీళ్లిచ్చారనో, వాళ్లిచ్చారనో -  బాగున్న అన్నాన్ని తృణీకరించ రాదు.


ఈ మొదటి రెండూ - తీసుకుని తినే అతిథికి చెప్ప బడింది. అంతే కాదు. యింట్లో సాధారణంగా గృహిణి  వండి వడ్డిస్తుంది. మిగతా వారు తింటారు ఆ తినే వాళ్లకు అందరికీ యిది తప్ప కుండా వర్తిస్తుంది. వండిన వాళ్లనో, వడ్డించే వాళ్లనో, తినే ఆహారాన్నో -తినే వారు తప్పు పట్ట కూడదు. కృతజ్ఞతా భావం వుండాలి. అది వుపనిషద్  వాక్యం. యిది జీవితాంతం పాటించ వలసిన వ్రతం.   

ఈ క్రింద వచ్చే సూత్రాలు - అన్నాన్ని  సంపాదించే వారికి, చేసే వారికి, వడ్డించే వారికి వర్తించే నియమాలు, వ్రతాలు.

3. అన్నం బహుకుర్వీత . తద్ వ్రతం .  (తై .ఉ. 3.9). 


అన్నాన్ని ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా  సంపాదించాలి . యిది కూడా వొక వ్రతం. అన్నం - అంటే - మనం నిత్యం ఉపయోగించే వస్తువులు కూడా - అని తెలుసుకోవాలి. అంటే- మనుషులకు ఉపయోగ పడే అన్ని వస్తువులు సంపాదించాలి. ఎందుకు మన అవసరాలకు మించి సంపాదించాలి?  ఈ ప్రశ్న  మన మనస్సులో తప్పక వస్తుంది .


ఎందుకు?

దీనికి సమాధానం, దీని తరువాత చాలా రకాలుగా నిర్దిష్టంగా  యివ్వ బడింది. పూర్తిగా చదవండి. మనం  గమనించ వలసిన  ముఖ్య విషయం ఏమిటంటే   -  "ఎక్కువ సంపాదించడం " - తప్పు  అని మన వారు అనలేదు. ధార్మికంగా  ఎంతైనా  సంపాదించండి. తప్పు లేదు.  

4. న కంచన వసతౌ ప్రత్యా చక్షీత . తద్ వ్రతం. తస్మాత్ యయాకయా చ విధయా - అన్నం - ప్రాప్నుయాత్ (తై .ఉ .3.10.)


ఆశ్రయాన్ని కోరి మీ యింటికి ఎవరైనా వస్తే - అటువంటి అతిథిని - ఎవరిని కానీ - లేదు, అని చెప్పి, తిప్పి పంప రాదు .  యిది కూడా వొక వ్రతం.    వారికి కావలసినవన్నీ - ఎంత వీలైతే అంత, ఎన్ని రకాలు గా నైనా సంపాదించాలి . అంటే  అన్నీ ధర్మ బద్ధమైన మార్గాలలోనే. చూశారా ! అతిథుల కోసం, అవసరం ఉన్నవారి కోసం, అడిగే వారి కోసం, లేని వారి కోసం - మీరు (ఎంత ఎక్కువైనా)  సంపాదించాలనే  - ఉపనిషత్తు కూడా చెబుతోంది. 

యిది వ్రతం అన్నారు

 కానీ, నిజానికి,  అన్నం,ఆస్తి లాంటివి - సంపాదించడంలో నిజమైన ఆనందం లేదు. యివి, ఏ విధంగా, మనం ఉపయోగిస్తామో, ఎవరి కోసం ఉపయోగిస్తామో - అందులోనే ఆనందం వుంది. యిది తెలియనంత వరకు - - జీవితంలో తృప్తి  నివ్వని, సుఖాలు వుంటాయేమో కాని , తృప్తి నిచ్చే ఆనందం మాత్రం అనుభవం లోకి రాదు.    

తెలుగులో మనకు తెలిసిన పద్యం వొకటి వుంది :

దానము, భోగము, నాశము, పరగంగా మూడు గతులె  భువి ధనమునకున్, దానము, భోగము నెరుగని దీనుని ధనమునకు, గతి తృతీయమే సుమ్మీ.  

దానము మొదటి  ,ఉత్తమమైన ఉపయోగం. యిక్కడ ధనం అన్న మాట, అన్నిరకాల ధనానికీ, అంటే, అన్నంతో బాటు అన్నిటికీ చేర్చి  - వాడబడింది. కాబట్టి, ఆస్తి, ధనము, అన్నము అన్నీ అని చెప్పొచ్చు. వీటికి మొదటి, శ్రేష్టమైన ఉపయోగం - దానమే. దాని తరువాత, దాన్ని మనమూ  భోగించ వచ్చు. సంతోషం పొందచ్చు. తప్పు లేదు. యివి రెండూ లేని మనిషి ధనం - ఎందుకూ పనికి రానిదౌతుంది. యిది మనం జ్ఞాపకం పెట్టుకో వాల్సిన విషయం. అక్షర సత్యం.  

5.    అరాధ్యస్మా అన్నమిత్యా ( అస్మై అన్నం అరాథి యితి), ఆ చక్షతే  (తై .ఉ .3.10.)


అతిథి  వస్తే - ఆహారం సిద్ధం గా వుంది, రండి భోంచెయ్యండి  - అనాలి. అంతే గాని లేదు, పోండి అనరాదు


చూడండి. మన పూర్వీకులు, అతిథి, అభ్యాగతులకు మనం చేయ వలసిన మర్యాదల గురించి ఎంత వివరం గా చెబుతున్నారో.  లేదనే పద్ధతి - మన సంస్కృతిలో లేదు. యిది ఎప్పటిది? ఉపనిషత్తు పుట్టిన కాలం నాటిది. ఈ -సంస్కృతి నా మనం కించ పరిచేది?  ఈ పద్ధతుల నుండి మనం ఎప్పుడు మారామంటే  - తురుష్కుల దండయాత్రలతో  సగం పైగా మారాము. ఆంగ్లేయుల   దండయాత్రలతో పూర్తిగా మారాము. లార్డ్ మెకాలే  అనే ఆంగ్ల ప్రభువు ఆంగ్ల పరిపాలకులకు యిచ్చిన సలహా యిదే . వీరి సంస్కృతిని నాశనం చేస్తే తప్ప, వీరి దయాగుణాన్ని నాశనం చేస్తే తప్ప - మనం వీరిని పరిపాలించడం అసంభవం అన్నాడు .అదే చేశారు కూడా. వొకరిపై, మరొకరికి వున్న మర్యాదను , నమ్మకాన్ని పోగొట్టడానికి. అతిథి మర్యాదలను పూర్తిగా పోగొట్టడానికి - ఎన్నో రకాల  పన్నాగాలు పన్నారు మనమూ అందులో పడ్డాము.

6.ఏతత్ ద్వై ముఖతోన్నగుం రాద్ధం; ముఖతోస్మా అన్నగుం రాధ్యతే  (తై .ఉ .3.10.)


- ఎవరైతే సిద్ధముగా వున్న అటువంటి అన్నమును ప్రసన్నతా భావం తోనూ శ్రద్ధ తోనూ అతిథికి యిస్తున్నాడో - అతనికి, అదే ప్రసన్నతా భావం తోనూ శ్రద్ధ తోనూ, అన్నం (అంటే - అన్నము, ఆస్తి, లాంటివన్నీ) తప్పకుండా ఇవ్వబడతాయి. దయా గుణం, దాన గుణం వున్న వానికి లోటు లేకుండా వచ్చి చేరుతుందని భావం.  

ఎవరిస్తారు  అతనికి ?  ప్రకృతిలోని సర్వ శక్తులూ, పరమాత్మా - అతని పట్ల కృతజ్ఞులై వుంటారు; వారు, ఎన్నో రకాలుగా అతనికి యివ్వడానికి ప్రయత్నిస్తారు అని - ఎన్నో శాస్త్రాలలో చెప్ప బడింది.  

ఈ మధ్య , యిదే విషయాన్ని - పాశ్చాత్య దేశాలలో  -లా ఆఫ్ అట్రాక్షన్ -అని అనేక రకాలుగా చెబుతున్నారు. మనం చేసే గొప్ప పనులకు, మంచి పనులకు, నిస్స్వార్థ  సేవలకు -  ప్రకృతి తోడుగా వుంటుందనేది  - యిప్పుడు వారు చెబుతున్న విషయం. అది తప్పు కాదు. నిజమే. అయితే  ఈ విషయం, మన వారికి, లక్షల సంవత్సరాలకు పూర్వమే బాగా తెలుసు. యిది, మన సంస్కృతి  లో ముఖ్యమైన భాగం. మనం పోగొట్టుకో కూడని భాగం.   యిక ముందు ఏం చెబుతుందో చూడండి.


7. ఏతద్వై మధ్యతోన్నగుం  రాద్ధం;  మధ్యతోస్మా అన్నగుం రాధ్యతే  (తై .ఉ .3.10.)


- ఎవరైతే సిద్ధముగా వున్న అటువంటి అన్నమును రాజసిక భావం తోనూ కాస్త అశ్రద్ధ , ఆలస్యం తోనూ అతిథికి యిస్తున్నాడో - అతనికి, అదే రకమైన భావం తోనూ అశ్రద్ధ తోనూ, ఆలస్యంగానూ అన్నం (అంటే - అన్నము, ఆస్తి, లాంటివన్నీ) తప్పకుండా ఇవ్వబడుతుంది. ప్రకృతి వారికీ వారిలోని గుణాన్నిబట్టే యిస్తుంది.

వొక్కో సారి - మన పూర్వజన్మ నుండి వచ్చిన సంచిత కర్మ కాస్త ఎక్కువగా వుంటే - యిప్పటి ఫలితం, అప్పటి సంచిత కర్మ ఫలంగా మొదట వచ్చేస్తుంది. ఆ తర్వాత , యిప్పటి కర్మ యొక్క ఫలితం మొదలవుతుంది. అందు వలన - యిప్పుడు అనుభవించే ఫలం, యిప్పటిదే అనుకునే ప్రమాదం వొక్కో సారి వుంటుంది. 

దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, చేసిన వారు, కొన్ని సంవత్సరాలు కేసు కూడా లేకుండా కులకడము యిందుకే. కానీ, యిప్పుడు చేస్తున్న పనికి ఫలితం - దాని తర్వాత తప్పక వచ్చేస్తుంది. అరె. యిదేమిటి. యింత అన్యాయాలు చేసే వారికే దేవుడు యిలా ఇస్తున్నాడే -అని  మనం వొక్కో సారి అనుకోవడము - ఆ, దేవుడేం చేస్తాడులే. అంతా నా చేతుల్లోనే వుంది - అని కొంత మంది లంచగొండులు, దోపిడీ గాళ్ళు అనుకోవడం   మనం చూస్తూనే వున్నాం కదా .

అటువంటి వారికి - కాస్త ఆలస్యంగా - శిక్ష పడి, న్యాయం జరగడమూ జరుగుతోంది కదా. యివన్నీ గీత లో కూడా రాయ బడింది.  యిది ఉపనిషత్తుల నాటి నుండి వుంది. మనిషి పుట్టిన నాటి నుండీ వుంది.


8. ఏతద్వై అంతతోన్నగుం  రాద్ధం;  అంతతోస్మా అన్నగుం రాధ్యతే. ఏ ఏవం వేదా .  (తై .ఉ .3.10.)


   
 ఎవరైతే సిద్ధముగా వున్న అటువంటి అన్నమును తామసిక భావం తోనూ, చాలా అశ్రద్ధ , చాలా ఆలస్యం తోనూ అతిథికి యిస్తున్నాడో - అతనికి, అదే రకమైన భావం తోనూ అశ్రద్ధ తోనూ, ఆలస్యంగానూ, అన్నం (అంటే - అన్నము, ఆస్తి, లాంటివన్నీ) యివ్వ బడుతుంది . ప్రకృతి, తామసిక గుణం వున్న వారికీ, వారిలోని గుణాన్నిబట్టే యిస్తుంది. యిది మనం బాగా తెలుసుకొని, అర్థం చేసుకుని వ్యవహరించాలి.

సరే. అసలు అన్నం దానమే చెయ్యని వానికి ఎలాంటి ఫలితం లభిస్తుంది. దీనికి, రామాయణం లోనూ, మరెన్నో పురాణాలలోనూ,  ఎంతో వివరణ వుంది. వొక గొప్ప రాజు, ఏన్నో మంచి కార్యాలు చేసాడు గాని - అన్న దానం చెయ్య లేదట . అందుకని, ఆయన బ్రహ్మ లోకానికెళ్ళినా, ఆయన ఆకలి మాత్రం తీరలేదట. తరువాత ఎప్పుడో, అగస్త్య మహాముని దయ వలన ఆయన ఆకలి బాధ తీరుతుంది. ఇలాంటి కథలెన్నో వున్నాయి మన సంస్కృతిలో.

అన్ని దానాల లోకి - అన్న దానం గొప్ప అని అందుకే అన్నారు.

చేసుకున్న వాడికి చేసుకున్నంత -అన్న సామెత వుంది కదా. అలాగే అన్ని దానముల లోకి , అన్న దానం గొప్ప - అన్న సామెత కూడా వుంది.

యిక్కడ మరొక ముఖ్యమైన అంశం మనము మరిచి పోకూడదు. 

అతిథికి మనమేదో, గొప్ప దానం చేసేస్తున్నాం - మనం లేకుండా అతనికి ఆకలి కూడా తీరదు. మనపై అతడు ఆధారపడి - వున్నాడు అనే భావనతో చేసే దానం చాలా వరకు వ్యర్థం అయిపోతుంది.  మనపై అతడు ఆధారపడడం కాదు. అతడు, మనకు పరమాత్మ యిచ్చిన గొప్ప అవకాశం, గొప్ప వరం  అని భావించి , "అతిథి దేవో భవ " అన్న భావంతోనే - అతనికి అన్నం పెట్టడం, తదితర సత్కారాలు చెయ్యాలి .

ఇలాంటి సమాజంలో ఎవరికి ఆకలి దప్పులు వుంటాయి చెప్పండి. దేశంలో ఎవరికి ఆకలి తీరకున్నా - అక్కడి రాజు నిద్ర పొయ్యే వాడు కాదు. రామ రాజ్యం అంటే - ఎక్కడా ఆకలి అన్నది లేని రాజ్యం.  



కొన్ని ఉదాహరణలు చూద్దాం.


1. శబరి రాముడికి తాను  కాస్తా కొరికి, బాగుంది అనుకొన్న దానినే  తినడానికి యిచ్చింది. ఆ అమాయకురాలి అతిథి సత్కారం ఎలాంటిది?

2. కృష్ణుడు హస్తినాపురానికి వెళ్లి - ఎవరి ఆతిథ్యం స్వీకరించాడు? విదురుడు సంజయుడు యిండ్లకు వెళ్ళాడు. అహంకారంతో పిలిచిన ఏ పెద్ద కులాల వాళ్ళ యిండ్లకూ వెళ్ళలేదు. అలాగే దరిద్ర భక్తుడైన కుచేలుడి వద్ద వున్నసత్తు పిండిని బ్రహ్మానందం తో తిన్నాడు కదా. ఎవరు యిస్తారన్నది, ఏం యిస్తారన్నది కాదు,  ఏ  భావంతో యిస్తారన్నది చాలా, చాలా, ముఖ్యం.

3. శంకరాచార్యులు - భిక్షాం దేహి అన్నప్పుడు, అయ్యో , తన దగ్గర ఏమీ లేదే అని కుమిలిపోతున్న గృహిణి  వద్ద, వొక్క మెతుకు తిని, కనక ధారా స్తోత్రం ద్వారా దేవిని అర్చించి - ఆమె యింట కనక వర్షం కురిపించాడు కదా.

ఇలాంటి ఎన్నో సంఘటనలు మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు లో కోకొల్లలుగా వున్నాయి.

అదే - మన  ఉపనిషత్తులలోని సామాజిక న్యాయం. పెట్టే వాడు అన్నం మాత్రం పెట్టడు. అతిథిని - దేవుడి లాగా సత్కరిస్తాడు.  అలాంటి - రాజ్యంలో అందరూ పెట్టే వాళ్ళే . తినే వాళ్ళ కోసం మీరు వెతకాలి. కుల, మత జాతి భేదాలు లేకుండా - అన్న దానం , అతిథి సత్కారం చెయ్యాలి. అదీ వుంది మన శాస్త్రాలలో.

నాకు తెలిసి, మా చిన్న  తనంలో, అప్పటి పెద్ద వారు చాలా మంది యిలా వుండడం నేను చూశాను.   


మనమందరూ - యిలా వుండాలి మరి. వుందామా?

=మీ 

వుప్పలధడియం విజయమోహన్ 

 



26, నవంబర్ 2012, సోమవారం

సత్యమేవ జయతే - సత్యానికి సాక్ష్యాలు ముఖ్యం - మూడు రకాల సత్యాలు - అబద్ధం - ఏమిటి? ఎక్కడుంది?

సత్యమేవ జయతే 



సత్యమేవ జయతే -అన్నది మన అశోక చిహ్నంలో రాసి పెట్టుకుని - మర్చిపోయాం. 

కళ్ళకు  అద్దాలు పెట్టుకుని కళ్ళద్దాలు వెదికే లాగ - యిప్పుడు సత్యం కోసం అందరూ వెదుకుతున్నారు.

మరి - ఘనత వహించిన కోర్టు వారు సాక్ష్యాధారాలు పరిశీలించి - వారికి తోచింది చెబితే అది సత్యం క్రింద చెలామణి అవుతుంది. దానిపై అప్పీలుకు వెళ్ళచ్చు. చాలా కోర్టులు పెట్టుకున్నాము మనం. ఏదో వొక చోట అసలు సత్యం యిదే - అని ఎవరో చెబుతారు. దానిపై యిక అప్పీలు వుండదు.

సత్యానికి సాక్ష్యాలు ముఖ్యం.

మొన్నటి నాడు మాయింట్లో ఏం కూరలు వండారో నాకు గుర్తుండదు. కానీ కోర్టుల్లో -పదేళ్ళ నాడు - ఆరోజు - రాత్రి మీరు ఎన్ని గంటలా ఎన్ని నిముషాలకు అక్కడ వున్నారు, ఏం చూశారు, అసలేం జరిగింది -అని లాయర్లు అడగడమూ, చూశాము, అన్న వాళ్ళు గడగడా తడుముకోకుండా పూస గ్రుచ్చినట్టు, ఏదో చెప్పడము, దానిపై ఆధార పడి  జడ్జీ గారు తమ తీర్పు మరో అయిదేళ్ళలో చెప్పడమూ - అప్పుడు, యిదీ నిజం అని మనం అనుకోవడము - జరుగుతోంది.

అబ్బా, ఈ కోర్టులకెళ్ళే వారందిరికీ, యింత జ్ఞాపక శక్తి ఎలా వస్తూ వుందో?

నాకైతే - పది వాక్యాలు చదివి - వాటిని వొప్ప జెప్పాలంటే  - రోజూ పది సార్లు చదివితేనే - గానీ  చెప్పలేను. అయినా స్కూల్లో ఫస్టు , సెకండు వచ్చే వాణ్ని. అరవై మూడేళ్ళ వయసు తరువాత  ఈ మధ్య -నేషనల్ స్టాక్  ఎక్స్చేంజ్  వారు నిర్వహించే పరీక్షలు రాసి 11 పరీక్షల్లో 85 శాతం పైగా వచ్చి - యెన్.ఎస్.ఈ. సర్టిఫయ్డ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ -లెవల్.5. అని సర్టిఫికేట్ కూడా తీసుకున్నా. అయినా, అక్కడా అంతే. మళ్ళీ - మళ్ళీ -చదివేతేనే గానీ - ఏదీ పెద్దగా గుర్తుండి చావవు.    

అందుకే నాకు పెద్ద ఆశ్చర్యం. ఈ కోర్టులకెళ్ళే వారందిరికీ, యింత జ్ఞాపక శక్తి ఎలా వస్తూ వుందో?

ఏక సంథా గ్రాహులున్నారు. కానీ, వారు కూడా, నాకు తెలిసినంత వరకూ, విన్నది మాత్రం చెప్పగలరు. చూసినవన్నీ మాత్రం కాదు. మీరు వున్న గదిలో (లేదా యింట్లో) - మీరు పదేళ్లుగా వున్నారనుకోండి. యిప్పుడు, మిమ్మల్ని, ఎవరైనా - మీ గదిలో ఉన్నవన్నీ సరిగ్గా, పూస గ్రుచ్చినట్టు చెప్పమంటే - మీరు చెప్పలేరు. చాలా తప్పులు చెబుతారు. మీ గదే మీకు తెలీదు. వూర్లో జరిగే విషయాలు మీకెలా తెలుస్తాయి.

అందుకే నాకు పెద్ద ఆశ్చర్యం. ఈ కోర్టులకెళ్ళే వారందిరికీ, యింత జ్ఞాపక శక్తి ఎలా వస్తూ వుందో?

అంత దూరం వద్దు. ఇప్పటికిప్పుడు, మీరు - కళ్ళు మూసుకుని - మీ శరీరంలో ఏమేమి ఎలా వుందో - బాగా చెప్పగలరా ? మీరు పడుకుని బాగా రిలాక్స్ అయి తరువాత - చెప్పమంటే మీకు నిజంగా రెండు కాళ్ళు వాటికి పది వేళ్ళు వున్నాయో కూడా -   మీకు తెలీదు.

మీ వెనుక (వీపు) భాగాన్ని మీరు ఎప్పుడు చూసారు? పదేళ్లకు ముందా ? అప్పుడూ చూడ లేదా? నేనూ అంతే.

కానీ, మీరు దారిలో వెళ్ళుతూ వుంటే, చీకట్లో, ఏ ఆక్సిడెంటో, దొంగతనమో జరిగితే - అందులో ఎవరికైనా, మీరు ఏ విధంగా నైనా, సహాయ పడితే -   అప్పుడు, మీరు అన్నీ చూడాలి. కనిపించక పోయినా సరే. అన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి.  అప్పుడెంత టైమో, సెకండ్ల వరకూ మీకు తెలియాలి. డిజిటల్ కెమీరా లో వీడియో తీసినట్టు, మీ మనస్సు అవన్నీ సరిగ్గా రికార్డు చేసుకోవాలి. ఆ కేమీరాలో కూడా - ఫోకస్ వున్న చోటు మాత్రమే వస్తుంది. మిగతావి రావు. కానీ, మీరు మాత్రం ఏదీ మిస్ కాకూడదు. నాకు ఇవేవీ చాత కాదు. కాబట్టి, నేను అటువంటి చోట్లలో వుండనే వుండను. అంటే నేను వున్న చోట - అటువంటివేవీ జరగనే జరగవు.

అందుకే నాకు పెద్ద ఆశ్చర్యం. ఈ కోర్టులకెళ్ళే వారందిరికీ, యింత జ్ఞాపక శక్తి ఎలా వస్తూ వుందో?

యిదంతా మాయా మంత్రాల కథ లాగా వుంటుంది నాకు.

ఏది నిజం? ఏది అబద్ధం? ఏది సత్యం? ఏది అసత్యం ? ఎలా తెలుస్తుంది - మనలాంటి సామాన్యులకు.

మన ప్రాచీనులు, అంటే ఋషులు, సత్యం అన్న దాన్ని రకరకాలుగా తెలియజెప్పారు.

సత్యం - వొక్క భగవంతుడే తప్ప - మరేదీ కాదు అన్నారు. ఆ భగవంతుడికి మరో పేరు పెట్టారు - బ్రహ్మం అని. బ్రహ్మం వొకటే వుంది (లేదా వున్నాడు).మరోటి లేదు - అన్నారు.

మార్పు లేనిది, ఎల్ల వేళలా -వొకే రకంగా వుండేది సత్యం అన్నారు.

బ్రహ్మం అన్న దానికి వొక డెఫనిషన్ యిచ్చారు ;  బ్రహ్మం =  సత్యం = జ్ఞానం = అనంతం 

అంటే - ఇవేవీ వేరు వేరు విషయాలు కాదు, అన్నీ వొక్కటే అని అన్నారు. బ్రహ్మం  అంటే  సత్యం అంటే జ్ఞానం  అంటే అనంతం - అన్న మాట. యిది ఎలా - అని తెలుసుకోవాలంటే ఉపనిషత్తులు చదవాలి. సరే.

బ్రహ్మాన్ని - పారమార్థిక సత్యం అన్నారు. మార్పే లేని సత్యం ఇదొక్కటే. యిది కాక, వేరే రెండు రకాల సత్యాలున్నాయి.

వొకటి - ప్రాతిభాసిక సత్యం. 

మెరిసేదల్లా బంగారం కాదు అంటాము. మెరిసేదాన్లో వొకటి బంగారం. మిగతావి మరేదైనా  కావచ్చు. కానీ, వొక్కో సారి, పసుపు పచ్చగా, రోడ్లో  దుమ్ములో మెరిసిపోతూ వుంటే మరో ఆలోచన లేకుండా తీసి జేబులో వేసుకుంటారు. అవసరంలో చూడరు.  ఎందుకు చూడరంటే  - మనం చేసే  పని మరెవరూ చూడకూడదని. అసలే చీకటి. అమావాస్య కూడా. మీకు అదృష్టమైన రోజు.

యింటికెళ్ళి మీ భార్యకో, భర్తకో చూపిస్తారు. వారి కళ్ళలో భయం కనిపిస్తుంది. అప్పుడు మీరూ చూస్తారు ఏమైందని.

యండమూరి బాణీలో - చెప్పాలంటే  - అప్పుడు తెలిసింది అది చిన్న పాము పిల్లని.

మీరు మీ భార్యని వదిలేసి, పామును పారేసి వీధి లోకి పరుగెత్తారు.

పాము పిల్ల బంగారం లా కనిపించడం ప్రాతిభాసిక సత్యం. మీరు మీ భార్యకు చూపే వరకు, అది సత్యమే. పాము పిల్ల జేబులో ఊగుతూ వుంటే - మీరు ఎంత సంతోషం తో నడిచారు. ఆ సంతోషం నిజం కాదా. అది పచ్చి నిజం.

కట్టెను పాము అనుకోవడం, భయ పడడం - ఈ ప్రాతిభాసిక సత్యానికి ఉదాహరణం గా వేదాంత గ్రంధాలలో చాలా సార్లు చెబుతారు. అది పరవాలేదు. దానికి రివర్స్ గా- పామును కట్టె  అనుకోవడం - దానిపై కాలు పెట్టడం, లేదా, దాని ప్రక్కనే నడవడం  చాలా సార్లు జరిగే విషయమే. అది ప్రమాద కరమైన - ప్రాతిభాసిక సత్యం.

ఏ భ్రమైనా - ప్రాతిభాసిక సత్యం క్రిందనే వస్తుంది. ఎండమావులలో నీళ్ళు వుందనే భ్రమ సహజం గా ఎడారుల్లో కలిగేది. 

మన దేశంలో, వొక పెద్ద భ్రమ వుంది.    నా కష్టాలకన్నిటికీ కారణం, వేరే ఎవరో - నేను మాత్రం కాదు - అనేది పెద్ద భ్రమ. యిది మనలో వున్న ప్రాతిభాసిక సత్యం.

మీ కష్టాలకు కారణం మీరు కాక పోతే - మీ సుఖాలకూ, మీరు కారణం కాలేరు. మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. కష్టే ఫలీ -అన్న సత్యాన్ని గుర్తుంచుకోండి. చెడ్డ అలవాట్లు వదిలి పెట్టండి. మీ సుఖాలకు మీరు కారణం అవుతారు. అప్పుడు తెలుస్తుంది - మీ కష్టాలకూ మీరే కారణం అని. యిది  ప్రాతిభాసిక సత్యం కాదు దీన్ని వ్యావహారిక సత్యం అంటారు.

 అలాగే - పక్క వాడికేవీ కష్టాలు లేవు - అన్నీ నాకే - అనిపిస్తుంది కొందరికి. ఎందుకు నాకే యిలా? అంటూ వుంటారు.అనుకుంటూ వుంటారు. పక్కింటాయనా యిలాగే అనుకుంటూ వుంటాడు. యిది  ప్రాతిభాసిక సత్యం.

అయితే - మగవాళ్ళు మరొకర్ని, వాళ్ళ కష్టాల్ని గురించి పెద్దగా అడగరు.స్వంత గోడు చెప్పుకోరు. మగ వాళ్ళు - కలిస్తే  మన్ మోహన్ సింగును గురించి, ఒబామాను గురించి, తక్కువ లెవెల్ లో మాట్లాడితే - లోకల్ యం.యల్.ఏ. గురించి మాట్లాడుతారు. తమ విషయాల్లో నామోషీ . 

కానీ - ఆడవాళ్ళు చాలా మంది - తమ, తమ విషయాలన్నీ అడిగి, చెప్పి, ఆ తర్వాత  - తెలుసుకున్న దాన్ని , మరో యిద్దరికీ చెప్పి - వొకరి కన్నీళ్లు, మరొకరి కళ్ళలో తుడుస్తూ వుంటారు. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ గొప్పా కాదు. 

ద్వాపర యుగంలో  ధర్మ రాజు శాపం పెట్టాడట - ఆడ వాళ్ళ నోట్లో ఏదీ దాగదని. సత్యమేవ జయతే - అక్కడి నుండే - వచ్చింది. అబద్ధం వుంటేనే సత్యం సత్యం 'జయిస్తుంది'.   లేకుంటే - దేనిపై జయిస్తుంది? 

కలల్లో వచ్చేవన్నీ - ఆ కలల వరకు నిజమే కదా. కలల్లో మీరు ఎంతో మందిని చంపుతారు. ఎంతో - మందితో ఏమేమో మాట్లాడుతారు, ఏడుస్తారు నవ్వుతారు. భయపడతారు. ఎన్నెన్నో మాజిక్కులు చేసుకుంటూ పోతారు.  అది మీ కల; మీ సృష్టి . మీరు ఏమైనా చెయ్యొచ్చు. చేస్తారు.  లేచిన తరువాత - అది నిజం కాదు , అప్పటి (కలలోని) ప్రాతిభాసిక సత్యం అని తెలుస్తుంది మీకు .

చాలా మందికి ప్రేమ అనేది, 'ప్రేమ కల' లో ఉన్నంత వరకు చాలా గొప్ప నిజంగా కనిపిస్తుంది. పెళ్ళి (లో నిద్ర లేచిన) తరువాత - అది "ప్రేమ కల" అన్న విషయం మెల్ల మెల్లగా తెలుస్తుంది. అమెరికాలో ప్రేమించి పెళ్లి చేసుకుని -మూడేళ్ళలో డైవర్స్ చేస్తూ వుంటారు. సత్యం తెలియడానికి మూడేళ్ళు కావాలి.   కొందరికి, మూడు రోజులు లేదా మూడు గంటలు కూడా సరిపోతుంది.

మరి ప్రేమ సత్యం కాదా? సత్యమే. ప్రాతిభాసిక సత్యమే. మీరు అందులో నుండి,  నిద్ర లేచే వరకు సత్యమే. మరి అమర ప్రేమలు, ఆజన్మాంత ప్రేమలు లేవా. వున్నాయి. అన్నమయ్య సినిమాలో అన్నట్టు - తెగవవి నీవు తెంచే వరకు .

ప్రాతిభాసిక సత్యం చచ్చే వరకు వుంటే - అది సత్యమా, కాదా. అది అప్పుడేమవుతుంది?

అదే - వ్యావహారిక సత్యం - అంటారు. అది వొక రకంగా జీవితాంతపు భ్రమ.

కోర్టుల్లో చెప్పే తీర్పు -   వ్యావహారిక సత్యం. 

పది మంది జరిగిందన్నారు. యిరవై మంది జరగలేదన్నారు. మరి తీర్పు ఎలా వుంటుంది? యిరవై మంది చెప్పేది సత్యం.

ఈ రోజు కూడా, పాకిస్తానీ లాయర్ గారు వొకరు - అసలు కసాబ్, మీ కాశ్మీరీ టెరరిస్టే  అయి వుంటాడు - మా వాడు కాదన్నాడు.మరి వారి కోర్టు ఏమంటుంది? ఏమీ అనదు. ముంబై లో చచ్చిన వాళ్ళంతా - వాళ్ళను వాళ్ళే -కాల్చుకున్నారు  అని చెప్పినా - మనమేం చెయ్యలేము. అంతా - ప్రాతిభాసిక సత్యమే. 

కానీ - అసలైన నిజం అనేది వొకటి వుంది. అది దేవుడికి తెలుసు. మనకు తెలియక పోవచ్చు.

వ్యావహారిక సత్యం అనేది - మనం మన పంచేంద్రియాలతో చూసి,విని,తాకి, మనసుతో (మెదడుతో) గ్రహించే విషయాలు. 

యిక్కడ చిక్కాల్లా - మనం కళ్ళద్దాలు వేసుకుంటే వొక రకంగా కన్పిస్తుంది. వేసుకోక పోతే మరో రకంగా కనిపిస్తుంది. వినేది రెండు,మూడు సార్లు వింటే కాని,జ్ఞాపకం వుండదు. మన, ఈ యింద్రియాలు  ఏవీ సరైనవి కావు. మన కంటే గ్రద్దకు, చూపు బాగుంది. కుక్కకు, చీమకు వాసనలు ఎక్కువగా తెలుస్తుంది.దోమ కూర్చుంటే తెలీదు. కుడితే తెలుస్తుంది. యిలా, మనకు తెలిసే వ్యావహారిక సత్యం వొక పరిధిలోనే తెలుస్తుంది.

అందుకే న్యాయ స్థానాలలో మనుషుల సాక్ష్యం కన్నా కుక్కల సాక్ష్యం విలువైనది. అవి దొంగలను సరిగ్గా గుర్తు పడతాయట. యివన్నీ వ్యావహారిక సత్యాలు. 

మీ భార్య వ్యావహారిక సత్యం. వొక్కో సారి ప్రాతిభాసిక సత్యంగా మారినా - ఆశ్చర్యం అక్కర లేదు. అలాగే, భర్త కూడా.

యిప్పుడు మనం మూడు రకాల సత్యాలను గురించి - కొద్దిగా చూసాం. 

- మొదటిది పారమార్థిక సత్యం. దాన్ని బ్రహ్మం అన్నాం.అదే నిజమైన సత్యం; నిజమైన జ్ఞానం; నిజమైన అనంతం. దాన్ని గురించి చెప్పాలంటే,వేదాంతం చెప్పాలి. అది మరో సారి, జీవితంలో బాగా విసిగిపోయినప్పుడు -  ఇహ నిజంగా జ్ఞానం వొచ్చేస్తే మేలు అన్నప్పుడు - చెప్పుకుందాం.

-రెండోది ప్రాతిభాసిక సత్యం. నిజంలా కనిపించే భ్రమ. కానీ భ్రమ కూడా అది ఉన్నంత వరకు నిజమే.భ్రమ పడి పోతే- అది నిజం కాదని వెంటనే తెలుస్తుంది.

-మూడోది వ్యావహారిక సత్యం. మీకు రెండు చేతులు వున్నాయి. అది వ్యావహారిక సత్యం. కానీ, అవి నిజానికి మీవి కావు అన్నది పారమార్థిక సత్యం.ఎక్కడినుండో వచ్చాయి. ఎప్పుడో వెళ్ళిపోతాయి.మీరు పుట్టడం పెరగడం, పెళ్లి చేసుకోవడం మీ అవస్థలు మీరు పడడం, సుఖం లో దుహ్ఖాన్ని, దుహ్ఖం లో సుఖాన్ని అనుభవించడం, యివన్నీ వ్యావహారిక సత్యాలే. 

మీ ప్రేమలు ప్రాతిభాసిక సత్యం కావచ్చు. వ్యావహారిక సత్యం కూడా కావచ్చు. మీ గుళ్ళో దేవుడు వ్యావహారిక సత్యం. కానీ పారమార్హ్తిక సత్యం కావాలంటే - మీ గుడి దేవుడు చాలా ఉపయోగ పడతాడు. యిది అర్థం కాని వారు, మీ విగ్రహారాధన తప్పు అంటారు. నిజానికి, మీ పూజలు పునస్కారాలు, వ్రతాలూ, అన్నీ పారమార్థిక సత్యం తెలుసుకోవడానికి గొప్ప మెట్లుగా ఉపయోగ పడతాయి.

నిజానికి స్వర్గం, నరకం రెండూ - వ్యావహారిక సత్యాలే. పారమార్థిక సత్యం కాదు.స్వర్గానికెళ్ళి - నిజంగా మీరు ఏం చేస్తారు, చెప్పండి ? గీత వొకరు, బైబిల్ వొకరు, కొరాన్ వొకరు చదువుతూ కూర్చుంటారా? అసలేం చేయాలని వుంది అక్కడ? అది యిక్కడే చేస్తే పోలా?

సరే.  యివన్నీ వదిలి పెట్టండి. అబద్ధం అంటే - ఏమిటి? అది ఎక్కడుంది?

సృష్టిలో ఎక్కడా అబద్ధం లేదు - వొక్క మనిషి నాలుకపై తప్ప.  సృష్టిలో మరే ప్రాణికీ - అబద్ధం ఆడడం తెలీదు. చెట్లూ పుట్టలూ పాములూ గ్రద్దలూ ఏవీ అబద్ధం ఆడ లేవు.మంచీ చెడూ, నాలుక నుండే వస్తూ వుంది. నాలుక కు మనిషి చిత్తం నుండీ వస్తూ వుంది.

నేను యింట్లో లేనని చెప్పరా - అంటే - నాన్న గారు యింట్లో లేరని చెబుతున్నారు - అని మనమూ పిల్లలూ, అబద్ధాలు చెబుతూ వుంటాము.  

మనం, రోజుకు కనీసం నాలుగు అబద్ధాలు చెబుతామట - సరాసరిగా. అందులో 50 శాతం చెప్పే అబద్ధం - "మేం బాగున్నామండీ" అని. అయితే - అది శుద్ధ అబద్ధం  అని ఆ తరువాత చెప్పే పది వాక్యాలలో - చెప్పేస్తాం.

రాసుకోవడం సత్యమేవ జయతే - కానీ, అది చేయాల్సింది మనం కాదు, ఏ దేవుడో వచ్చి చెయ్యాలి. అదీ మన పంథా.

యిక్కడే వుంది మన వేదాల సారాంశమంతా; వేదాంతపు సారాంశమంతా. 

మన చిత్తంలో, మన నాలుక పైన - అబద్ధం తగ్గే కొద్దీ - అక్కడ బ్రహ్మం సాక్షాత్కరిస్తూ వస్తుంది. మనలో, సత్యం పెరిగే  కొద్దీ, జ్ఞానం పెరుగుతూ పోతుంది. అప్పుడు, అనంతం ఏమిటో తెలుస్తూ వుంటుంది.  

అబద్ధం మనలో, పూర్తిగా పోయిన నాడు, మనకు మోక్షమే. జ్ఞానమే ఆనందమే. ఎక్కడో కాదు - యిక్కడే. బ్రతికి వున్నప్పుడే. 

అందుకే - చాలా మంది నిజమైన స్వాములు - ఎప్పుడూ చిరునవ్వుతో  కనిపిస్తారు. కానీ - మనకు దొంగ స్వాములపైనే వుంటుంది మనసు. మిమ్మలను ఎలెక్షన్ లో గెలిపిస్తాను. మీ శత్రువు వోడి పోయేలా చేస్తాను. మీకు వ్యాపారంలో  లాభం వచ్చేలా చేస్తాను - అనే వాళ్ళంతా - దొంగ స్వాములే. వాళ్ళు చెప్పేది అన్నీ అబద్ధాలే . మీరు అడిగేవి అన్నీ అబద్ధాలు నిజాలు కావాలనే.  ఆ రూట్ లో ఆనందం ఎప్పుడూ వుండదు.

కానీ - రమణ మహర్షి కానీ, శ్రీ శ్రీ రవిశంకర్ కానీ, రామకృష్ణులు కానీ - గాంధీ గారు కానీ - - నవ్వితే అమాయకపు, నిజమైన, స్వచ్చమైన నవ్వులే నవ్వుతారు. వారు మీకు యిచ్చేది - వేరే రకపు ఆనందం. వారి సమక్షంలో - మీకు వచ్చేది - కోరికలే లేని, స్వచ్చమైన మనసు.  అందులో వుండేది అనిర్వచనీయమైన ఆనందం. 

-దాన్నే  బ్రహ్మానందం అంటారు. అంతకు మించిన ఆనందం  ప్రపంచం లో మరొకటి లేదు. 

నిజానికి, ఎప్పుడో వొక సారి, మనం, ఏదైనా వొక గొప్ప నిజం చెప్పిన నాడు, మన మనసులో ఎక్కడో, కాస్సేపు అది ప్రతిఫలిస్తుంది. ఆ ఆనందం - చాలా, చాలా గొప్పది - అనేది మనకు తెలుస్తుంది కూడా.

అది కావాలనుకున్న నాడు -అబద్దాలాడడం - నిలిపేసెయ్యండి.  

సత్యమేవ జయతే.

= మీ 

వుప్పలధడియం విజయమోహన్  


 
  





19, నవంబర్ 2012, సోమవారం

PSORIASIS - GREAT WAYS TO GET RID OF - గొప్ప చిట్కాలు - సోరియాసిస్-యితర చర్మ సమస్యలు


skin Problems- Psoriasis - Good way to get rid of

చిన్న రోగాలు- పెద్ద సమస్యలు - గొప్ప చిట్కాలు 

సోరియాసిస్-యితర చర్మ సమస్యలు 


గత వొక దశాబ్దం గా అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి.

హృద్రోగ సమస్యలు, ఊపిరి తిత్తుల వ్యాధులు , చక్కెర వ్యాధి, రక్త పోటు లాంటివి ఎన్నో - యిప్పుడు చాలా సాధారణమై పోయాయి.

వీటిలో దేనికీ - అల్లోపతీ వైద్యంలో - సరైన . పూర్తి నయం చేసే మందులే లేవు. పోగొట్టడం కాదు - ఎక్కువ బాధ పెట్టకుండా చేయడం వుండటం మాత్రమే వారు  చేయ గలుగుతున్నారు . దీన్ని వారు రోగాల మేనేజ్మెంట్ -అంటున్నారు 

యివి నయమైతే - వారి మందులకు విక్రయం వుండదు  గనుక వారు - యిదే మంచిది అనుకున్నట్టు    - వొక్కో సారి అనిపిస్తుంది .

హృద్రోగాలు రాకుండా కాపాడే మందులు ఆయుర్వేదంలో ఎన్నో వున్నాయి. అందులో - ప్రశస్తమైనవి "అర్జున" చెట్టు నుండి వచ్చే మందులు. అలాగే ఆశ్వ గంధ ; ఇలాంటి ప్రశ స్తమైన మందులు  చాలా రోగాలు రాకుండా కాపాడతాయి. వచ్చిన రోగాలనూ, క్రమంగా, తగ్గించేస్తాయి.

చదివే వారికి నా విన్నపం ఏమంటే - వీటిని గురించి - మీకు తెలిసిన వారందరికీ చెప్పండి. రోగాలు రాకుండా చూసుకోవచ్చు.

సరే.  కొన్ని వ్యాధులు ప్రాణ హాని చేయవు కానీ. మానసికంగా చాలా బాధ పెడతాయి. అటువంటి వాటిలో - చర్మ రోగాలు ముఖ్యమైనవి. అందులో వొకటి సొరియాసిస్. యిది ఎందుకు వస్తుందో - యిదిమిత్థంగా  ఎవరికీ తెలీదు.

కానీ, మానసిక ఉద్విగ్నత (స్ట్రెస్) అందులో వొక ముఖ్య కారణం. అది కాక, వాతావరణం, అందులోని హెచ్చు తగ్గులు , కాలుష్యం మరొక కారణం. చర్మంలో తగినంత తేమ లేకపోవడం వొక ముఖ్య కారణం.అంటే - డ్రై స్కిన్ -వుంటే  యిది రావడానికి ఎక్కువ అవకాశం వుంటుంది. అంటే - చలి కాలం ; ఏ.సీ లో ఎక్కువ గడపడం యివి కూడా ముఖ్య కారణాలే .

తెల్లవారి 5 గంటల కాలంలో - సూర్యుడి కిరణాల్లో - విటమిన్-డీ. ఎక్కువగా వుంటుంది.అది తగులుతూ వుంటే - చర్మానికి అనేక రకాలుగా మంచిది. చర్మ వ్యాధులు రావు.

అలాగే చర్మం పొడి గా కాకుండా చూసుకోవడం ముఖ్యం. అంటే - అలోవేరా, ఈవియాన్ లాంటి ఆయింట్మెంట్లు ఎక్కువ గా వాడడం వలన చాలా ప్రయోజనం కనిపిస్తుంది . వీటిలో విటమిన్.డీ. కూడా వుండే ఆయింట్మెంట్లు యిప్పుడు ఎన్నో మార్కెట్లో వున్నాయి. అవి చాలా మంచివి.

యివన్నిటితోబాటు - మరో ముఖ్యమైన చిట్కా ఏమిటంటే - పసుపు కలసిన మంచి  ఆయింట్మెంట్లు -ఎన్నో మార్కెట్ లో వున్నాయి. ఉదాహరణకు, వీకో టర్మేరిక్ లాంటివి.  అవి - చర్మ సౌందర్యానికి అని చెబుతున్నారు. కానీ, చర్మ రోగాలకు, ముఖ్యంగా, సోరియాసిస్ కు బాగా పని చేయడం  నేను చూసాను.. సోరియాసిస్ వున్న వారు, యివి అన్నీ వొకే సారి వాడినా తప్పు లేదు. వాడి చూడండి. మీకు చక్కటి ఫలితం కనిపిస్తుంది.

యివి కాక, ఆయుర్వేదాలోనూ ,సిద్ధ వైద్యం లోనూ - చాలా మంచి మందులే వున్నాయి. ఉదాహరణకు - స్వామీ రాందేవ్ గారి వద్ద దొరికే మందులు , తై లాలూ బాగా పని చేస్తాయి. (కాయకల్పవటి తైలము, టాబ్లెట్లు , మహామంజుష్ట టాబ్లెట్లు లాంటివి). వీటన్నిటితో బాటు - టర్మరిక్, ఆలోవేరా  ఆయింట్మెంట్లు (విటమిన్.డీ కలసినవి ) తప్పక వాడండి. 

సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులకు అతి ముఖ్య వైద్యము - వాటిని గురించి వర్రీ కాక పోవడమే. ముఖ్యంగా - అది చర్మపు పైపొరకు మాత్రం వచ్చే వ్యాధి  - చర్మం లోని రెండో  పొరని కూడా అది బాధించదు అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. లోపలి అన్ని అంగాలు బాగా పని చేస్తున్నాయి అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి.

వీటిలో - మనలో వుండే భయము, సిగ్గు మాత్రమే ముఖ్య రోగం కాని - అవి రెండూ వదిలేస్తే - నిజమైన రోగం ఏమీ బాధించదు -అనేది గుర్తుంచుకోవాలి.

నిజానికి - చాలా రోగాలకు మనలోని భయము, సిగ్గు - మిగతా వారు ఏమనుకుంటారో అన్న భావన, ఎవరో ఏదో వొక మాట అంటే దానిని తలుచుకునే బాధ పడటం తప్ప , నిజమైన  బాధ ఏమీ వుండదు. ఈ మనో వ్యధల / బాధల వల్లనే మోకాళ్ళ నొప్పులు , మరో నొప్పులు, మరో వ్యాధులు వస్తూ వుంటాయి.

ప్రాణాయామాలు, ధ్యానము నేర్చుకొని ప్రతి రోజూ ఎంత సేపు వీలైతే అంత సేపు చెయ్యండి.  మీకు తప్పకుండా తగ్గుతుంది. తగ్గుతుందన్న  నమ్మకంతో చెయ్యండి. తగ్గాలనే నిశ్చయంతో చెయ్యండి. నిరాశకు అసలు చోటు ఇవ్వకండి. 

చాలా రోగాలు మనో జనితమైనవి. మనసుతోనే తగ్గించుకోగలిగేవి.

మీ ఆరోగ్యం - మీ చేతుల్లోనే వుందన్న నమ్మకంతో చెయ్యండి. గెలుపు మీదే .

ఈ రోగాలున్న వారికి ప్రక్క నున్న వారు -వీరికి అన్ని రకాలుగా ప్రోత్శాహం యివ్వాలి. ఈ చర్మరోగాలు, ప్రక్క నున్న  వారికి ఎవరికీ రావు. వీలైతే వారికి ఆయింట్మెంట్లు మీరే పుయ్యవచ్చు. అది చాలా మంచిది.

మనకు వచ్చే రోగాలన్నీ పోగలిగేవే. యిది గొప్ప సూత్రం. ప్రతి రోగానికీ మందు వుంది. సగం మందు మనలోనే  వుంది. దాంతోనే పూర్తిగా పోవచ్చు కూడా. సగం మందు బయట వుంది. 

ధైర్యే , సాహసే, ఆరోగ్య లక్ష్మి. (అధైర్యే, భయే, అనారోగ్య ప్రాప్తి).


= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 





18, నవంబర్ 2012, ఆదివారం

సేవాలయ - శివాలయ - దేవాలయ - ఎందరో మహానుభావులు - వారికి, నా అభివందనాలు


సేవాలయ -  శివాలయ  - దేవాలయ 

సేవాలయా టీం  లోని వారు -మధ్యలో మురళి -వ్యవస్థాపకుడు 



ఇప్పుడు - నేను వుండే వూరి  పేరు తిరునిన్రవూరు . ఇది తమిళనాడులో చెన్నై - తిరుపతి  జాతీయ రహదారిలో, చెన్నై లో- చిట్టచివర వుంది.

మా వూళ్ళో , వొక బహు పురాతన, చరిత్ర ప్రసిద్ధి గల శివాలయము, మరొక   బహు పురాతన, చరిత్ర ప్రసిద్ధి గల విష్ణు ఆలయము వున్నాయి.

శివాలయానికి హృదయాలయ ఈశ్వర ఆలయమని పేరు. యిది  వొక గొప్ప యోగి తన హృదయంలో తన  కల్పన ద్వారా     మొదట నిర్మించాడట. ఆ తరువాత, వొక రాజు దీనిని  కట్టాడు. అదొక అందమైన కథ. విష్ణు ఆలయం  కూడా చాలా పురాతన ఆలయం. రెండూ - వేల సంవత్సరాల క్రితం కట్టినవే 

అవి రెండూ, ప్రసిద్ధ ఆలయాలే .

చాలా గొప్పవే.

కానీ మా వూళ్ళో - మరో గొప్ప ఆలయం వుంది. దాని పేరు సేవాలయ. 

అది వొక అనాథ శరణాలయం - అనాథలకోసం వొక మంచి పాఠశాల - వొక మంచి వృద్ధాశ్రమం - వొక గోశాల -  యిలా ఎన్నిటికో రూప కల్పన జరిగి, చాలా బాగా నడుస్తున్న దేవాలయమని చెప్పొచ్చు.  

17-నవంబరు -మా 34-వ పెళ్లిరోజు.

క్రిందటి రెండు సంవత్సరాలూ - మేం అక్కడికి వెళ్లి మాకు తోచిన డొనేషన్ యిచ్చేసి వచ్చాము.     మళ్ళీ , అప్పుడప్పుడు, డొనేషన్ ( పుట్టిన రోజు  లాంటి వాటికి)   యిస్తూ వుంటాను.

కానీ ఈ సారి, కాస్త మార్పు వుండాలని - అక్కడి పిల్లల తో కాస్సేపు గడపాలని అనుకున్నాము.

16 నాడు  డొనేషన్ యిచ్చేసి - 17 న  మేం  వస్తామని  చెప్పాము. చెప్పినట్లే, నేను, నా శ్రీమతి  12.20 మధ్యాహ్న సమయంలో - అక్కడికి వెళ్ళాము.

మొదట వృద్ధాశ్రమంలో - అక్కడి వయోవృద్ధులు, దాదాపు డెబ్భై మంది  భోజనం చేస్తూ వుంటే -వారితో  అక్కడ,  వారి జీవితాన్ని గురించి  ముచ్చటించాము. వారు - బయటి ప్రపంచంలో -దాదాపు ఎవరూ లేని వారు. ఏమీ లేని వారు. కానీ అక్కడ సంతోషం గా గడుపుతున్నారు. 

వారందరూ మమ్మల్ని ఆశీర్వదించితే - చాలా సంతోషమనిపించింది. 

వారి ఆశీర్వాదంలో - అది వారి హృదయాంతరాళం నుండి వస్తూ ఉందన్నది చాలా బాగా, స్పష్టంగా,  మాకు కనిపించింది. కొంత మంది అన్నం తింటూ వున్న చేతితో , లేచి, కొద్దిగా, ఆనందంతో వచ్చే కన్నీళ్ళతో, రెండు చేతులతో ఆశీర్వదించడం - ఎంతో హృదయాన్ని తాకే విధంగా వుంది.    

- గోశాలలో 70 ఆవులకు  పైగా వున్నాయి. వాటిల్లో - పాతిక భాగం పాలిచ్చే ఆవులైతే, ముప్పాతిక భాగం వట్టిపోయిన వృద్ధ ఆవులు. వాటినీ  బాగా చూసుకుంటున్నారు వాళ్ళు . సంతోషం అనిపించింది. ఆ ఆవులూ సంతోషంగా  కనిపించాయి .

సరే. అక్కడినుండి, పిల్లలను చూసేందుకు వెళ్ళాము. అది వారి భోజన సమయం. మేమూ వారితో పాటు కూర్చుని భోంచేశాము. నేను వారికి వడలు వడ్డిస్తూ, వారితో మాట్లాడాను. వారి పేర్లు, చదువుతున్న క్లాసు, ఎలా చదువుతున్నారో అని - అన్నీ అడిగాను. అందరినీ అడిగాను.

యల్  కే  జీ  నుండి 12 వరకు - అన్ని క్లాసుల పిల్లలూ వున్నారు.

మామూలు పిల్లలలో  వుండే డిసిప్లిన్ - కంటే అక్కడ చాలా ఎక్కువ - అని చెప్పొచ్చు. అక్కడే వుండి  చదువుకునే పిల్లలంతా   - తల్లీ-తండ్రీ  లేని వారే .దాదాపు 200 మంది.

బయటి నుండీ వచ్చే పిల్లలూ చాలా బీద కుటుంబాల నుండీ వచ్చిన వారే.  వారు దాదాపు వెయ్యి మంది.

హాస్టలు పిల్లలు అందరితో మాట్లాడాను. వారంతా - థాంక్సు చెబుతుంటే - తమాషాగా వుంది. 

యల్ కే జీ పిల్లలు, వారి అమాయకపు కన్నులతో మిమ్మల్ని చూస్తూ, ఉత్సాహంగా, మీకు థాంక్స్ చెబితే ఎలా  వుంటుంది? 12 వ క్లాసు పిల్లలలో వారి భవిషత్తు గురించి  కలలు కొంత మనం స్పష్టంగా చూడొచ్చు. సేవాలయ వారు - వారి కాలేజీ చదువుకూ సహాయం చేస్తారట. వుద్యోగం దొరికే వరకు రక రకాల సహాయం చేస్తారట.

మాకు  చాలా బాగా అనిపించింది.

తల్లీ-తండ్రీ  లేని పిల్లలు - అక్కడ సంతోషంగా వుండి - బాగా చదువుతున్నారు; నూటికి నూరు శాతం వుత్తీ ర్ణులవుతున్నారు - అంటే  సేవాలయ యాజమాన్యం బాగా పని చేస్తున్నట్టే కదా . ఎందరో  మహానుభావులు . నేను చేయని (లేని) పని అంత సమర్థంగా నిర్వహిస్తున్న -  వారికి, నా  హృదయ పూర్వక అభివందనాలు.  

పిల్లల శుభాకాంక్షలు , వృద్ధుల ఆశీర్వాదాలు అందుకోవడం - దేవుడు నేరుగా వచ్చి ఆశీర్వాదం యిచ్చినట్టే వుంది.

మరి దేవాలయంలో అయితే - దేవుడి ఆశీర్వాదం - అలా మన అనుభవంలోకి రాదు కదా.

దేశంలో -  ఏ వొక్కరూ భోజనం లేకుండా వుండకూడదు; చదువు లేకుండా వుండకూడదు . ఏ వొక్కరూ - అనాథలుగా  వుండాల్సిన అవసరం వుండకూడదు - అని నాకు మాత్రం స్పష్టంగా అనిపించింది.

మీరూ - నేనూ అనుకుంటే - యిది మనం చేయ గలం.

మరి చేద్దామా? 

సేవాలయా  ను గురించి  వొక విడియో ను మీరు క్రింద యిచ్చిన యు ఆర్ యల్  ను కాపీ చేసి  మీ ఇంటర్నెట్  ద్వారా చూడొచ్చు. వినొచ్చు .

http://www.youtube.com/watch?v=CuZeSQSZ2bc&feature=youtu.be

= మీ 

వుప్పలధడియం  విజయమోహన్ 





 


1, నవంబర్ 2012, గురువారం

కొత్త రోగాలకు పాత మందులు - డెంగ్యూ వ్యాధి కి బొప్పాయ చెట్టు ఆకుల రసం - హృద్రోగాలకు అర్జున - ఎన్నో రోగాలకు, బలహీనతలకు ఆశ్వ గంధ


కొత్త రోగాలకు పాత మందులు 


ఈ మధ్య ఎన్నో కొత్త కొత్త రోగాలూ వస్తున్నాయి. కొత్త కొత్త మందులూ వస్తున్నాయి.

మనకు తెలిసిన వాటిలో  ప్రముఖం గా వుండే వైద్య విధానాలు - (1) అల్లోపతి (2) హోమియోపతి (3) ఆయుర్వేదం. 

యింకా ఎన్నో వున్నాయి. యునాని, చైనీస్  ఆకుపంక్చర్ లాంటివి. కానీ మన దేశంలో, బాగా ఉపయోగంలో వుండేవి పై మూడూ.

నేను - అన్ని విధానాలనూ , ఎంతో, కొంత ఉపయోగించే  వాడిని.

మూడూ కొన్ని, కొన్ని రోగాలకు ప్రత్యేక తరహాలలో ఉపయోగ పడతాయని నాకు అనిపిస్తుంది.

సర్జరీ కావాల్సిన పరిస్థితులలో, అల్లోపతి తప్పనిసరి.  అలాగే మరికొన్ని రోగాలకూ అల్లోపతి బాగా పనికొస్తుంది. ఉదాహరణకి, కుక్క కాటు, పాము కాటు, కొన్ని జ్వరాలు, టీబీ లాంటి వాటికి అల్లోపతి మంచిది.

కానీ - చాలా రోగాలకు, అల్లోపతిలో సరి అయిన మందులు లేవు.

 వాటిలో చాలా వాటికి ఆయుర్వేదంలో - చాలా మంచి మందులు వున్నాయి. కొన్నిటికి హోమియోపతి లో మంచి మందులు వున్నాయి.

ఆయుర్వేదం లక్షల ఏండ్ల అనుభవంతో వచ్చిన శాస్త్రం. మన దేశంలో పుట్టినది పెరిగినది. నా ఉద్దేశంలో తురుష్కుల , ఆంగ్లేయుల పాలన లేకుండా వుంటే   యిప్పటికి ఆయుర్వేదంలో, ఎన్నో పరిశోధనలు జరిగేవే. ఎన్నో రకాల ప్రక్రియలు వచ్చేవే .


యిప్పుడైనా - భారత ప్రభుత్వం వారు - ఈ శాస్త్రానికి బహుళ  ప్రాధాన్యత యిచ్చి, పరిశోధనలను ప్రోత్సహించ వలసిన అవసరం  ఎంతైనా వుంది.

ఈ మధ్య - నాకు వచ్చిన సమాచారాల ప్రకారం - డెంగ్యూ వ్యాధి కి అల్లోపతి లో పెద్దగా మందులు లేవు. కానీ, ఆయుర్వేదం ప్రకారం - బొప్పాయ చెట్టు ఆకుల రసం -రోజుకు రెండు ఆకుల రసం యిస్తే చాలు, వెంటనే - రక్తం లోని ప్లేట్లెట్ల సంఖ్య గణ నీయంగా పెరిగి, జ్వరం కూడా తొందరాగా వుపశమిస్తుంది.  

  నాకు వచ్చిన ఈ సమాచారాన్ని నేను నాకు తెలిసిన వారందిరికీ పంపించాను. వారిలో నాకు బాగా తెలిసిన వారింట్లో దీన్ని అమలు   చెయ్యడము  జరిగింది . చాలా సత్ఫలితాలు వచ్చినట్టు  వారి నాకు చెప్పడమూ జరిగింది. 

బొప్పాయ ఆకులు, పండ్లు 



అందు వలన నాకు తెలిసిన ఈ వైద్యాన్ని పాఠకులందరికీ  అంద  జేస్తున్నాను. అల్లో పతి  వైద్యం వద్దని అనడం లేదు. డాక్టర్ దగ్గరికి పోవద్దని చెప్పడం లేదు. తప్పకుండా వెళ్ళండి. కానీ, వొక ప్రముఖ సినీ నిర్మాత దర్శకుడైన యాష్ చోప్రా గారిని కూడా అల్లోపతి మందులు రక్షింప లేకపోయాయి . కనుక  మన  దేశీయ వైద్యం, మన ప్రక్కనే దొరికే బొప్పాయి ఆకుల రసం త్రాగడం, మనల్ని రక్షిస్తే మంచిదే కదా. అందుకని రాస్తున్నాను.

అలాగే - వొక ఉపన్యాసంలో, స్వామీ రాందేవ్ గారు తిప్పతీగ రసం, డెంగ్యూ కు బాగా ఉపయోగపడుతుంది - అన్నారు. దీన్ని అమృతారిష్టము అని- టాబ్లెట్ల రూపంలో కూడా అమ్ముతారు.  యిది జ్వరం వున్న వారు తీసుకుంటే - మంచిది. అసలు, ముందుగా తీసుకునే వారికి  వ్యాధులు రాకుండా చేయగల సామర్థ్యం వుంది తిప్ప తీగకు. 

ఈ వైద్యాలు మీకు తెలిసిన అందరికీ చెప్పండి.

అలాగే - ఆయుర్వేదంలో - మరెన్నో అద్భుతమైన మందులు వున్నాయి. నాకు తెలిసిన వాటిలో " అర్జున" అన్న మందు వొకటి. హృదయానికి, అనేక రకాలుగా శక్తి  నిచ్చి, అనేక  హృద్రోగాలనుండి - కాపాడగల సామర్థ్యం వుంది "అర్జున" కు. 

హృద్రోగాలు వున్న వారైనా సరే , భవిష్యత్తులో - రావచ్చునేమో అన్న శంక వున్నా వారైనా సరే -  అలాంటి ఏ శంకా  లేని వారైనా సరే - "అర్జున" వాడడం చాలా మంచిది. 

నేను వాడుతున్నాను. నాకు తెలిసిన వారు చాలా మంది వాడుతున్నారు.  


అర్జున ఆకులు, పండ్లు, చెట్టు బెరడు 


యింటర్ నెట్ లో దీన్ని గురించి విస్త్మృత  సమాచారం వుంది. 

ఉదాహరణకు :



ఈ లింక్ క్లిక్ చేసి చూడండి ఇలాంటి మరిన్ని వున్నాయి. మీరు ఏ ఆయుర్వేద వైద్యుడిని అడిగినా చెబుతారు దీన్ని గురించి. - అయితే యిప్పుడు , దీని పై మరిన్ని పరిశోధనలు జరగడము, మరిన్ని సత్ఫలితాలు కనుగొనడమూ జరుగుతోంది. 

అలాంటిదే - మరొక దివ్యౌషధము -ఆశ్వ గంధ - అన్నది . యిది కూడా ఎన్నో రకాలుగా మన ఆరోగ్యానికి ఉపకరించే  ఔషధం.  యిది, ఎన్నో, ఎన్నో రోగాలకు, బలహీనతలకు చాలా, చాలా బాగా ఉపయోగ పడే ఔషధం. యిదీ నేను వాడుతున్నాను. చాలా మంది వాడుతున్నారు.


ఆశ్వ గంధ చెట్టు బెరడు, ఆకులు, పండ్లు 


దీన్ని గురించి కూడా  యింటర్ నెట్ లో విస్త్మృత  సమాచారం వుంది. ఉదాహరణకు :



యిలా ఎన్నో దివ్యౌషధాలు ఆయుర్వేదంలో వున్నాయి. రోగాలు రాకుండా కాపాడేవి కొన్ని. దీర్ఘ రోగాలను కూడా పోగొట్టేవి కొన్ని. వీటికి - అల్లోపతి  మందులకున్న -సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. నిజానికి వొక రోగానికి తీసుకున్న మందు, మరెన్నో రోగాలకు కూడా పనికొస్తుంది. అయితే - -ఏదైనా  మోతాదు మించి తీసుకోవడం పనికి రాదు. మితంగా తీసుకుంటే - అమృతం. 

అమితంగా తీసుకునేది ఏదైనా   తప్పే కదా.

నాకు తెలిసిన వాటిలో, చాలా మంచివి అని నేను నమ్మే వాటిని - కొన్నిటిని యిక్కడ చెప్పాను.

యివన్నీ మనకు దొరికేవే. మంచి ఆయుర్వేద తయారీ కంపెనీలు తయారు చేస్తున్నవే. యింట్లోనూ - చేసుకో గలిగేవే.

ఆరోగ్యమే మహా భాగ్యం కదా.  

మీకు తెలిసిన వారికి చెప్పండి. ఎంత మంది ఆరోగ్యం బాగు పడితే  అంత మంచిది.

= మీ 

వుప్పలధడియం విజయమోహన్